తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
12, జూన్ 2009, శుక్రవారం
గణిత సూత్రాలు
సంప్రదాయానుసారంగా,
ఆ పత్రికా సంపాదకుడు
నేను రాసిన పత్రం మరో నలుగురికి పంపి
వాళ్ళ అభిప్రాయాలు అడిగి,
ఆ అభిప్రాయాలు సేకరించి నాకు తిరిగి పంపి,
నా పత్రాన్ని తదనుగుణంగా సవరించి పంపమన్నాడు.
అందులో మూడు అభిప్రాయాలు,
"ఈ పరిశోధనా పత్రం బాగానే ఉంది. ప్రచురణార్హమే!" అని వచ్చేయి.
నాలుగోది మాత్రం నన్ను ఏకెస్తూ వచ్చింది.
నా గురువుగారు నాలుగూ చదివి,
"మొదటి మూడూ మనకి పనికిరానివి, అవి పక్కన పెట్టెయ్;
ఆ నాలుగోది ఘాటుగా ఉందని ఉడుక్కోకు, అదే మనకి ఉపయోగపడుతుంది.
ఆ నాలుగో అభిప్రాయం చదివి
అందులో ఉన్న ఆక్షేపణలన్నిటిని మనస్పూర్తిగా స్వీకరించి,
నా పత్రాన్ని మరమ్మత్తు చెయ్యమని "చెప్పి, నాతో అన్నారు:
"మన పనిని ఆ క్షేపించినవాడే
మన అసలు స్నేహితుడు. ఇది జ్ఞాపకం పెట్టుకో!"
అన్నారు.
(చదవండి!
http://lolakam.blogspot.com/2009_04_01_archive.html )
7, మే 2009, గురువారం
ప్రణవ నాద మహిమ
కీర్తనలు నెల కొనాలి!
మననము చేయుము,ప్రణవ నాదమును
23, ఏప్రిల్ 2009, గురువారం
వయోజన విద్య
తేనీలు
22, ఏప్రిల్ 2009, బుధవారం
నందమూరు (ఉంగుటూరు)
విశ్వనాథ సత్యనారాయణ తెలుగు వారికి గర్వ కారణమైన పండితుడు;చిత్రంగా అనేక విమర్శలకు, ప్రశంసలను పొందిన మహా కవి. గాంధీజి ఉద్బోధించిన "సహాయ నిరాకరణోద్యమము"లో పాల్గొని ,తన ఉద్యోగాన్ని వదులుకున్న "మాతృ దేశ స్వాతంత్ర్యాభిలాషి ఈయన"అని చాలా మందికి తెలియదు. ఈయన తల్లి దండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి. కృష్ణా జిల్లా నందమూరులో ( అనగా నేటి ఉంగుటూరు మండలము ) ,1895లో సెప్టెంబరు 10వ తేదీన (మన్మథ నామ సంవత్సరములో, భాద్రపద బహుళ షష్టి రోజు) శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జన్మించారు. తండ్రి శోభానాద్రి భక్తాగ్ర గణ్యుడు. సాధారణముగా ,తల్లి దండ్రులు 'తమ పిల్లలలోని పండిత్య ,లలిత కళాది ,విజ్ఞాన అంశాదులలో గల ప్రజ్ఞను వారి బాల్యములోనే గుర్తించ లేరు కానీ శోభనాద్రి, తన కుమరుడు 'భవిష్యత్తులో మంచి పాండిత్యమును ఆర్జిస్తాడని" గుర్తించారు. . కనుకనే " తన పుత్రుడు వ్రాయ బోవు వ్రాయ బోవు మహా కావ్య కృతిని ఈశ్వరునికే అంకితము చేసెను." శోభనాద్రి భవిష్యత్తును అవగాహన చేసుకోగల మహా ద్రష్ట " అని ఈ సంఘటన వలన తేట తెల్లమగుచున్నది. శ్రీ మద్రామాయణ కల్ప వృక్షమును " తన తండ్రి కోరిక ననుసరించి" ,"నీహార రుక్ శ్రీ మంతంబయి పొల్చు, మహా తేజో మూర్తి యగు విశ్వేశ్వరునకే " అంకితము చేసెను. శోభనాద్రి కర్మ యోగి ఐన పరమ భక్త శిఖా మణి. నందమూరులో పరమేశుని నిలిపి, నిష్కామముగా గడిపిన ధన్యుడు , మహోన్నత జీవన పథగామి శోభనాద్రి . |
Views (27) |
నాయని జలతరంగిణి
నాయని సుబ్బారావు గారు హైదరాబాద్లో ఒక ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ ఇంటి యజమానురాలి పేరు "దమయంతి ప్రతి రోజు మాదిరిగానే రోజూ, మున్సిపాలిటీ పంపు ద్వారా నీళ్ళు వచ్చినప్పుడే, అందరూ నీళ్ళను పట్టుకో వాల్సి వచ్చేది. యధా ప్రకారం బిందెలతో, కడవలతో అక్కడి పోర్షన్లలో నివసించే వాళ్ళు జల యజ్ఞ సాధన కొరకై వచ్చి ఉన్నారు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు మంచి నీళ్ళు పట్టు కుంటున్నారు. ఇంతలో నెమ్మదిగా owner దమయంతి వస్తూంటే, అందరూ ఆమెను పలకరించారు. నాయని అన్నారిలాగ, చమత్కారంగా "నల్లా మహారాజు కోసరం దమయంతి వస్తున్నారు." పంపు, కొళాయి, కుళాయి, నల్లా ఇత్యాది పర్యాయ పదాలలో, ఆ జల వాహకమును తెలంగాణా జిల్లాలలో "నల్లా"అని అంటారు.
|
Baala
నిధి
ఓమ్ నమః శివాయ! అచ్చులతో అద్దకాలు సరిగంచులు నేసి మేము ఇస్తాము చదువన్నది 'నిధి మూట' గైకొనరా ఓరన్నా! 1)మంచె పైన రైతన్న ! పలక పట్టుకున్నాన్న వడిసెల ఒక చేత బలపం ఒక చేత వడి వడిగా విద్యలన్ని నేర్చి తీరుతానంటూ ప్రతిన పట్టి,తన ఒట్టుకు "శ్రీ కారం"చుట్టాడు// 2)అజ్ఞానం తిమిరాలను తూర్పార బట్టాడు తప్పొప్పుల తప్ప తాలు గాలి కెగిరి పోతాయి ఉల్లాసం నింగి కెగయ విజ్ఞానం ధాన్య రాశి గొని పోవును ఇంటికి // |
Pramukhula Haasyam
మాటలకు పిసినారి
మధునాపంతుల సత్యనారాయణ ఆంధ్ర సాహిత్య రంగములో ఎనలేని కృషి చేసిన వ్యక్తి. తెలుగు సారస్వత సేవ ఆయనకు గుర్తింపునుతెచ్చింది. 1993 మార్చ్ 5వతేదీన ఆంధ్ర దేశ రాజధాని "భాగ్య నగరము"లో ఆయన సంస్మరణ సభ జరిగినది. చిక్కడ పల్లి లైబ్రరీలో ఆ రోజు జరిగిన "శ్రీ మధునాపంతుల సంస్మరణ సభ"లో మధునా పంతుల రచనల విన్నాణము గురించి వక్తల ఉపన్యాసాలు కొనసాగుతున్నాయి. డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇలా అన్నారు "మధునాపంతులుగారు పదాల దగ్గర పరమ లోభి. ఆయన రాసిన పద్యాలలోనుండి, ఈ మాటని ఇక్కడ అనవసరంగా వేసారుఅంటూ తీసి వేయడానికి, ఏరి వేద్దామంటే ఏ ఒక్క పదము కూడా డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇలా అన్నారు "మధునాపంతులుగారు పదాల దగ్గర పరమ లోభి. ఆయన రాసిన పద్యాలలోనుండి, ఈ మాటని ఇక్కడ అనవసరంగా వేసారుఅంటూ తీసి వేయడానికి, ఏరి వేద్దామంటే ఏ ఒక్క పదము కూడా దొరకదు". " |
పాపిటిబిళ్ళలు
ఘుమ్మని భువి గుబాళించె.// మెరుపు దార హారాలు దేవ కన్యకల చేతుల పొరపాటున జారినవో?! వర్ష బిందు రత్న మణులు జల జల జల రాలిన విటు.// గడ్డి పూల తలల పైన పాపిటి బిళ్ళలు ఐనవి బుల్లి వర్ష బిందువులు. గంతులేస్తు, చిందులేస్తు పిల్లలు ఫక్కున నవ్విరి. |
టపా(ట) కాయలు
వేటూరి సుందర రామ్మూర్తి సినీ రంగంలో "పాటల రచయిత"గా కాలూని, లబ్ధ ప్రతిష్ఠులు అయ్యారు. గీత రచయితగా అనేక అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వేటూరికి రా సాగాయి. "మనసు కవి"గా సుప్రసిద్ధులు ఐన ఆత్రేయ గారికి అవకాశాలు సన్నగిల్లాయి. ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' దీపావళి పండుగ వస్తూన్నది. అంతటా హడావుడి సందడిగా ఉన్నది. మార్కెట్టులో ఆ ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యారు. పరస్పరమూ పలకరించుకున్నారు.ఆత్రేయ కావలసిన బాణసంచా కొనేసి, నిండు సంచీతో ఇంటిముఖం పట్టారు. "టపా కాయలు కొనేసారా?" స్నేహ పూర్వకముగా అడిగారు వేటూరి సుందర రామ్మూర్తి. "నా 'పాట కాయ'లన్నీ మీకే వస్తున్నాయి గదా! అందుకే ఊరికే ఖాళీగా ఉండట మెందుకు లెమ్మని, ఇదిగోండి!ఇలాగ 'టపా కాయలు' తెస్తున్నాను." అన్నారు ఆత్రేయ స్నేహ పూర్వకంగానే , సంభాషణలలోనూ పదముల అలికిడిని కలిగిస్తూ . |
Views (6) | Post Your Commen |
వందనమిదే!
నిలిచిన తొలకరుల మబ్బులకు అభివాదము! అభివాదము! // పాడేటి పికములకు చివురులను ఒసగిన మామిడి తరువులకు,//అభి// పాడి పంటల అలరారేటి పల్లెల తొణికేటి మమత లన్నిటికిని //అభి// మా పల్లె జనములకు చదువులను ప్రేమతో నేర్పేటి గురువులకు అభివాదము! అభివాదము // |
కొత్త అంజనం
పల్లవి: వేణు వినోదం మృదు భావ విహారం |
1) ఈలల గీతం
ఈ లలనల హాసము
సుమధుర శబ్దములాయినవి
సంగీతమునకు చిరు నామాలు
కోరస్:
ఇల్లూ వాకిలి,పల్లె పట్ణములు
రేవులు,వనములు,కోవెలలు
కళల వలయముల హరివిల్లులయేను
2)గళముల సౌరుగ జానపదాలు,
ప్రతి అడుగు జాడలును
చిందిన సొగసుల పల్లె పదాలను
3)ఇందిందివియే ఇవియే
అరువది నాలుగు కళలకు నెలవులు
Baala
పెళ్ళిపెద్ద
(answer)::: ఘీంకరిస్తూ అడవికి పోతా! (ప్రశ్న) ::: అడవికి పోయి అటేమి చేస్తావ్? ( answer )::: పద్మావతినీ భయ పెడతాను శ్రీనివాసులుతొ దోస్తీ కట్టి సాష్టాంగం!దండ ప్రణామం! అమ్మకు,అయ్యకు కళ్యాణం అంగ రంగ వైభోగంగా జరిపించేస్తా! నా వీపు పైన అంబారి కట్టి వధూ వరులను కూర్చుండ బెట్టి ఊరేగిస్తా ముల్లోకములు. |
పూవు
సుతి మెత్తని సుతారమీవు // మెత్తని నవ్వువు నువ్వు తావిని ఎడదను హత్తు కొందువు// రంగుల నద్ది, రేకు రేకును తురగము చేసి వెన్నెల తేరుకు, బహుమానం ఇచ్చిన దాతవు నువ్వు // బాలల జగతికి నీవే ఊహల సారధి వైనావే! కవి భావాలను నువ్వే దౌడును తీయిస్తావు // |
Recipes
జలుబు తగ్గేందుకు చిట్కా:
అల్లము రసము - చెంచాడు
తమలపాకుల రసము - రెండు చెంచాలు
తేనె - రెండు చెంచాలు
ఈ మూడిట్నీ కలపాలి. ఈ రసముల మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి త్రాగాలి. త్రాగిన వెంటనే ఒక చెంచాడునీళ్ళు తాగాలి. ఇలా చేస్తే పడిశము నుండి కొంత ఉపశమనము లభిస్తుంది.
డాక్టరు దగ్గరికి వెంటనే వెళ్ళేందుకు వీలు కుదరనప్పుడు, ఇలాటి చిట్కాలు ఆపద్ధర్మముగా ఉపకరిస్తాయి.
జ్వరంలో పాణిగ్రహణం!
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య 1889 జూన్ లోకృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులో జన్మించారు. అప్పటి దాకా కందుకూరి వీరేశ లింగము మున్నగు వారి సంఘ సంస్కరణలలో వన్నె కెక్కిన ఆంధ్ర దేశము, స్వాతంత్ర్య పోరాటములో కూడా దీటు లేనిదనే ఖ్యాతిని గాంచినది. సరే! వారి జీవితములో ఒక హాస్య సంఘటన తాలూకు "రిమ రిమల"ను జ్ఞప్తికి తెచ్చుకుందాము. ఒక సారి గోపాల క్రిష్ణయ్య గారికి జ్వరం వచ్చింది. కుశల మడగుదామని దువ్వూరి సుబ్బమ్మ గారు వచ్చారు. ఆమె కూడా స్వాతంత్ర్య సాధనకై పోరాట రంగములోనికి ప్రవేశించిన అలనాటి నారీ శిరో మణి. జ్వర తీవ్రతతో "హా హా హూ హూ " అంటూ తెగ వణికి పోతున్నారు ఆ రామదండు నేత. "ఏమిటీ? జ్వరం ఎక్కువగా ఉన్నదా? ఏదీ చూస్తాను!" అంటూ చేయి పట్టుకుని నాడిని చూడసాగారు సుబ్బమ్మగారు. అంత జ్వరంలోనూ "అసలే జ్వరంతో బాధ పడుతూంటే మధ్యలో పాణి గ్రహణము కూడానా!" అని ఛలోక్తిని విసిరారు దుగ్గిరాల. |
తపము లేనిదె యెన్నరే నెపము లెల్ల!
"ఆంధ్ర రత్న" బిరుదు కల దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు. కోదండ రామయ్య, సీతమ్మ దంపతులకు పుణ్య ఫలముగా పుట్టిన గోపాల క్రిష్ణయ్య "రామ దండు" సమర దళమును నిర్మించి,స్వాతంత్ర్యసయుద్ధములో తన క్రియా శీలతను నిరూపించుకొనిన ధీశాలి. అంతేకాదు! ఆయన గాయకుడు, రచయిత కూ డా! ఆ దుగ్గిరాల వారి రచనలలో ఒక వ్యంగ్య సీస పద్యమును చూడండి. కొండెంకటప్పన్న గుండు సున్న గదన్న గోపాల కిట్టాయి కొక్కిరాయి టంగుటూరు ప్రకాశ మింగిలీసు పిశాచి నాగేశ్వరుడు వట్టి నాగ జెముడు పట్టాభి సీతన్న తుట్టె పురుగు గదన్న ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు గొల్ల పూడ్వరన్న కళ్ళు లేని కబోది బులుసు సాంబడు వట్టి పుట్టు కుంక అయ్యదేవర గాడు పెయ్య నాకుడు గాడు అయ్యంకి రమణయ్య దయ్యమయ్య డాక్టర్ సుబ్రహ్మణ్య మాక్టింగ్ పులిష్టాపు దువ్వూరి సుబ్బమ్మ దృష్టి బొమ్మ తే.అనుచు పల్కుదు రాంధ్రుల నవని యందు గాంధి శ్రేష్ఠుని మతములో గలిసి నపుడు తపము లేనిదె యెన్నరే నెపము లెల్ల రామ నగరీ నరేంద్ర! శ్రీ రామచంద్ర! ఈ శతక పద్యము తొలి భాగము చదవగానే "ఇది తిట్టు కవిత్వము కామోసు!" అని అనిపిస్తుంది. "గాంధి మహాత్ముని"మతములో చేరినపుడు అందరూ అలాగ అనుకొన్నారనగానే,ఆ రచనలోని చమత్కారము చదువరికి నవ్వు తెప్పిస్తుంది. నేటి ఎన్నికల ప్రచారము హోరు గమనించండి. దూషణ భూషణ తిరస్కారములతో, తిట్టు పురా నేటి ఎన్నికల ప్రచారము హోరు గమనించండి. దూషణ భూషణ తిరస్కారములతో, తిట్టు పురాణములతో దద్దరిల్లి పోతూన్నది వాతావరణము. ఈ సందర్భములో పైన పేర్కొన్నట్టి పద్యము గుర్తుకు తెచ్చుకున్నాను! |