12, జూన్ 2009, శుక్రవారం

గణిత సూత్రాలు

నేను విద్యార్ధిగా ఉన్న రోజులలో, మొదటిసారి పరిశోధనా పత్రం రాసి ప్రచురణకి పంపినప్పుడు,
సంప్రదాయానుసారంగా,
ఆ పత్రికా సంపాదకుడు
నేను రాసిన పత్రం మరో నలుగురికి పంపి
వాళ్ళ అభిప్రాయాలు అడిగి,
ఆ అభిప్రాయాలు సేకరించి నాకు తిరిగి పంపి,
నా పత్రాన్ని తదనుగుణంగా సవరించి పంపమన్నాడు.

అందులో మూడు అభిప్రాయాలు,
"ఈ పరిశోధనా పత్రం బాగానే ఉంది. ప్రచురణార్హమే!" అని వచ్చేయి.
నాలుగోది మాత్రం నన్ను ఏకెస్తూ వచ్చింది.

నా గురువుగారు నాలుగూ చదివి,
"మొదటి మూడూ మనకి పనికిరానివి, అవి పక్కన పెట్టెయ్;
ఆ నాలుగోది ఘాటుగా ఉందని ఉడుక్కోకు, అదే మనకి ఉపయోగపడుతుంది.
ఆ నాలుగో అభిప్రాయం చదివి
అందులో ఉన్న ఆక్షేపణలన్నిటిని మనస్పూర్తిగా స్వీకరించి,
నా పత్రాన్ని మరమ్మత్తు చెయ్యమని "చెప్పి, నాతో అన్నారు:

"మన పనిని ఆ క్షేపించినవాడే
మన అసలు స్నేహితుడు. ఇది జ్ఞాపకం పెట్టుకో!"
అన్నారు.
(చదవండి!
http://lolakam.blogspot.com/2009_04_01_archive.html )

7, మే 2009, గురువారం

ప్రణవ నాద మహిమ

ప్రణవ నాద మహిమ ;;;;; '''''''''''' నామము ఏదైన నేమి-కీర్తన ఏదైన నేమి?! పదే పదే "ఓం"అనుచు-పలుకవే!ఓ మనసా! ప్రణవ నాద మననములో -తనియుమా!మైమరచీ!! // శ్రీ వాణి కొన గోటిని-కచ్ఛపి వీణియపైన సుతారముగ కదలుచున్న-నాద బింబ మిదే కదా! ఆ నాద బ్రహ్మ మిదే!ఇదే! // విష్ణు తనయుని జన్మ స్థలమిది సహస్ర దళ యుత ఆది పద్మము; జ్~ఞాన మధువు ఉప్పొంగు చున్నది గ్రోలవె,హృదయమా! ఇదే తరుణము! // కోరస్;; '''''' ఓం ఒం ఒం ; మది తుమ్మెద గ్రోలుతోంది; ఓం జ్ఞానము సారము; పరమానంద స్వరూపము; కను గొను మనసుదే,ఈ భాగ్యము! // '''''''''''''''''''''''''''''''''''''''''''''''

కీర్తనలు నెల కొనాలి!

మననము చేయుము,ప్రణవ నాదమును;;;; '''''''''''''''''''''''''' .............. లి;కీర్తనలు నెల కొనాలి!;;;;; '''''''''''';; మిత్రమా! శ్రవణేంద్రియాలూ,హృదయమూ ; ఇంకా అలాగే,అలాగ ఎండిన బీడుల్లాగ ఉన్నాయేమిటి?! భగవత్ కృపా భావనా వాహినులను ప్రవహించనీయి! కీర్తించు!కీర్తించు! దైవమును కీర్తించు! చెట్టు వ్రేళ్ళు ఎంత లోతుగా దూసుకు వెళతాయో అంత ఎత్తుకి ఆ అంబరంకేసి; ఎదుగుతూ సాగ గలుగుతూన్నది పాదపము! ** పెరిగే కొలదీ తన శాఖలను విస్తరిస్తూ దిశలనంటికీ పల్లవ,ఫల,పుష్ప పరిమళాలను గాలి దోసిళ్ళతో పంచుతూంటుంది. పాయలు పాయలుగా సాగుతూ, ప్రవాహాలు సారవంతమైన ద్వీపాలను నిర్మిస్తాయి. సంకీర్తనా మాధుర్యాన్ని కర్ణేంద్రియాలు గ్రోలినపుడే హృదయం'సస్య కేదార క్షేత్రంగా విరాజిల్లుతుంది. భక్తితో స్తుతి చేయి!భజన చేయి!కీర్తించు! తనివారా కీర్తనా సంరంభ పారవశ్యములో ఓలలాడు! "దైవ తాదాత్మ్య అనుభూతి అనిర్వచనీయమైనదనీ బోధ పరచుకున్నప్పుడు! నిఖిల జగము నీ మానస సీమలో వికసిస్తుంది! భజన చేయి! భజన చేయి! భజన చేయుమోయీ! ''''''''''''''''''''''''''''''''''''''''''''''''

మననము చేయుము,ప్రణవ నాదమును

మననము చేయుము,ప్రణవ నాదమును;;;;
'''''''''''''''''''''' 
(చేతన,2007 లో ప్రచురణ);;;;; 
'''''''''''''''''''''''  
పెదవుల డోలలలోన ; 
ఊగనీయరా నాద బ్రహ్మం!;
ఓం!ఓం! ఓంకారం!;
ఓం...........3 //
 
కేంద్ర బిందువు ; 
'నాభీ'నుండి బయలు దేరగా; 
గళము మార్గమున పయనము చేయుచు; 
విచ్చేయునురా నాద బ్రహ్మం!;
అదియే అదియే ఓంకారం; 
ఓం,,,,,,,, 3 //  

నాలుకపైన చిత్తడిఒ ఆటలు; 
బుడి బుడి నడకలు,
పరుగులు అవగా; 
క్రీడించురా నాద బ్రహ్మము; 
తనువే అగును మేఘ మల్‌హారము  
ఓం................ //

23, ఏప్రిల్ 2009, గురువారం

వయోజన విద్య


వయోజన విద్య ;;;;; ''''''''''' ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; పలక తెమ్మంటేను పలక కుండా ఉంటె నేనేమి చేతును?ఓ రంగయో! నేనేమి చేతును?ఓ రంగయో! // అతను :;;;;; ''''''''' పలక,బలపం తోటి పరుగు పరుగున నన్ను అరుగు మీదకు పిలిచి కూర్చుండ బెడుతుంది నా పూల రంగి! చదువు విసుగంటేను వినకున్నదీ2 // చిలకవీ నువ్వంటు నన్ను బులిపిస్తాడు పాఠాలు చదవక ఎగవేయ జూస్తాడు ఆరు నూరైనా నే నూరుకుంటాన? విద్దె నేర్వని వాడు వింత పసువేకదా అక్షరాలు ముద్దు, బతుకు బాటలొ పూలు! పలక ,బలపం తోటి ఓ రంగయో! ఉన్న పాటున బడికి పోదామయా! రాత్రి బడికి చక్కగెళదామయా! //

తేనీలు

 
తేనీలు ;;;;; 
'''''''''  
నీ క్రీ గంటి చూపుల గొడుగులోన 
నేను ఛత్రపతినీ,
సర్వం సహా ప్రణయ సామ్రాజ్యానికి
సామ్రాట్‌నీ! సఖియా!!! 
''''''''''''''''''''''''''''
నీ మమతల జరీ ప్రోగులతో
పకడ్బందీగా అల్లినట్టి
ప్రేమ పంజరములో 
నిశ్శ్శంకగా బందీగా 
ఈ ప్రణయంపు రామ చిలుక. 
''''''''''''''''''''''''''''  
కొక్కిరాయి రేయి
వెన్నెలలను  
నీ వీక్షణముల భరిణలలోన నింపి
నీ నిడుపాటి నీలి కురుల ఊయెలలను 
బహుమతులుగా పొంది 
మా మతులను కాస్తా పోగొట్టినది కద,ఔరా!
బహు గడసరి కదా ఈ నిశి! 
''''''''''''''''''''''''''''' 
నీ భావనల జడి వానలు 
ఏకధాటిగా కురిసి,కురిసీ
నా మానస సరోవరమ్ము 
ప్రణయ సుధల వెల్లువలతో త్రుళ్ళుతోంది. 
'''''''''''''''''''''''''''''  
నిను చూసిన మరు క్షణమే
అటు రేయీ,
ఇటు పగలూ
ఐనాయి కలికీ!
బంగారు కలలకు నేస్తాలు.

'''''''''''''''''''''''''''''
'''''''''''''''''''''''

22, ఏప్రిల్ 2009, బుధవారం


నందమూరు (ఉంగుటూరు)

By kadambari piduri, Mar 3 2009 5:16PM
విశ్వనాథ సత్యనారాయణ తెలుగు వారికి గర్వ కారణమైన పండితుడు;చిత్రంగా అనేక విమర్శలకు, ప్రశంసలను పొందిన మహా కవి. 
గాంధీజి ఉద్బోధించిన "సహాయ నిరాకరణోద్యమము"లో పాల్గొని ,తన ఉద్యోగాన్ని వదులుకున్న "మాతృ దేశ స్వాతంత్ర్యాభిలాషి ఈయన"అని చాలా మందికి తెలియదు. 
ఈయన తల్లి దండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి. 
కృష్ణా జిల్లా నందమూరులో ( అనగా నేటి ఉంగుటూరు మండలము ) ,1895లో సెప్టెంబరు 10వ తేదీన (మన్మథ నామ సంవత్సరములో, భాద్రపద బహుళ షష్టి రోజు) శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జన్మించారు. 
తండ్రి శోభానాద్రి భక్తాగ్ర గణ్యుడు. సాధారణముగా ,తల్లి దండ్రులు 'తమ పిల్లలలోని పండిత్య ,లలిత కళాది ,విజ్ఞాన అంశాదులలో గల ప్రజ్ఞను వారి బాల్యములోనే గుర్తించ లేరు 
కానీ శోభనాద్రి, తన కుమరుడు 'భవిష్యత్తులో మంచి పాండిత్యమును ఆర్జిస్తాడని" గుర్తించారు. 
. కనుకనే " తన పుత్రుడు వ్రాయ బోవు వ్రాయ బోవు మహా కావ్య కృతిని ఈశ్వరునికే అంకితము చేసెను." 
శోభనాద్రి భవిష్యత్తును అవగాహన చేసుకోగల మహా ద్రష్ట " అని ఈ సంఘటన వలన తేట తెల్లమగుచున్నది. 
శ్రీ మద్రామాయణ కల్ప వృక్షమును " తన తండ్రి కోరిక ననుసరించి" ,"నీహార రుక్ శ్రీ మంతంబయి పొల్చు, మహా తేజో మూర్తి యగు విశ్వేశ్వరునకే " అంకితము చేసెను. 
శోభనాద్రి కర్మ యోగి ఐన పరమ భక్త శిఖా మణి. 
నందమూరులో పరమేశుని నిలిపి, నిష్కామముగా గడిపిన ధన్యుడు , 
మహోన్నత జీవన పథగామి శోభనాద్రి .
Views (27) 

నాయని జలతరంగిణి

By kadambari piduri, Apr 20 2009 1:08PM
నాయని సుబ్బారావు గారు హైదరాబాద్లో ఒక ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ ఇంటి యజమానురాలి పేరు "దమయంతి ప్రతి రోజు మాదిరిగానే రోజూ, మున్సిపాలిటీ పంపు ద్వారా నీళ్ళు వచ్చినప్పుడే, అందరూ నీళ్ళను పట్టుకో వాల్సి వచ్చేది. యధా ప్రకారం బిందెలతో, కడవలతో అక్కడి పోర్షన్లలో నివసించే వాళ్ళు జల యజ్ఞ సాధన కొరకై వచ్చి ఉన్నారు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు మంచి నీళ్ళు పట్టు కుంటున్నారు. ఇంతలో నెమ్మదిగా owner దమయంతి వస్తూంటే, అందరూ ఆమెను పలకరించారు. నాయని అన్నారిలాగ, చమత్కారంగా "నల్లా మహారాజు కోసరం దమయంతి వస్తున్నారు." పంపు, కొళాయి, కుళాయి, నల్లా ఇత్యాది పర్యాయ పదాలలో, ఆ జల వాహకమును తెలంగాణా జిల్లాలలో "నల్లా"అని అంటారు. 

దమయంతి వస్తున్నారు." పంపు, కొళాయి, కుళాయి, నల్లా ఇత్యాది పర్యాయ పదాలలో, ఆ జల వాహకమును తెలంగాణా జిల్లాలలో "నల్లా"అని అంటారు. 

అదీ సంగతి. కవి గారి సొగసైన శ్లేషకు ఇలాగ అవకాశం దొరికింది.
Views (9)

Baala

నిధి

By kadambari piduri, Apr 19 2009 10:14AM

ఓమ్ నమః శివాయ! 
అచ్చులతో అద్దకాలు 
సరిగంచులు 
నేసి మేము ఇస్తాము 
చదువన్నది 'నిధి మూట' 
గైకొనరా ఓరన్నా! 

1)మంచె పైన రైతన్న ! 
పలక పట్టుకున్నాన్న వడిసెల ఒక చేత 
బలపం ఒక చేత 
వడి వడిగా విద్యలన్ని 
నేర్చి తీరుతానంటూ 
ప్రతిన పట్టి,తన 
ఒట్టుకు "శ్రీ కారం"చుట్టాడు// 


2)అజ్ఞానం తిమిరాలను 
తూర్పార బట్టాడు 
తప్పొప్పుల తప్ప తాలు 
గాలి కెగిరి పోతాయి 
ఉల్లాసం నింగి కెగయ 
విజ్ఞానం ధాన్య రాశి 
గొని పోవును ఇంటికి // 

Pramukhula Haasyam

మాటలకు పిసినారి

By kadambari piduri, Apr 20 2009 12:50PM
మధునాపంతుల సత్యనారాయణ ఆంధ్ర సాహిత్య రంగములో ఎనలేని కృషి చేసిన వ్యక్తి. తెలుగు సారస్వత సేవ ఆయనకు గుర్తింపునుతెచ్చింది. 1993 మార్చ్ 5వతేదీన ఆంధ్ర దేశ రాజధాని "భాగ్య నగరము"లో ఆయన సంస్మరణ సభ జరిగినది. చిక్కడ పల్లి లైబ్రరీలో ఆ రోజు జరిగిన "శ్రీ మధునాపంతుల సంస్మరణ సభ"లో మధునా పంతుల రచనల విన్నాణము గురించి వక్తల ఉపన్యాసాలు కొనసాగుతున్నాయి.

డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇలా అన్నారు "మధునాపంతులుగారు పదాల దగ్గర పరమ లోభి. ఆయన రాసిన పద్యాలలోనుండి, ఈ మాటని ఇక్కడ అనవసరంగా వేసారుఅంటూ తీసి వేయడానికి, ఏరి వేద్దామంటే ఏ ఒక్క పదము కూడా 


డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇలా అన్నారు "మధునాపంతులుగారు పదాల దగ్గర పరమ లోభి. ఆయన రాసిన పద్యాలలోనుండి, ఈ మాటని ఇక్కడ అనవసరంగా వేసారుఅంటూ తీసి వేయడానికి, ఏరి వేద్దామంటే ఏ ఒక్క పదము కూడా దొరకదు". " 

పాపిటిబిళ్ళలు

By kadambari piduri, Apr 17 2009 5:22PM
కమ్మని వానొచ్చింది 
ఘుమ్మని భువి గుబాళించె.// 
మెరుపు దార హారాలు 
దేవ కన్యకల చేతుల 
పొరపాటున జారినవో?! 
వర్ష బిందు రత్న మణులు 
జల జల జల రాలిన విటు.// 
గడ్డి పూల తలల పైన 
పాపిటి బిళ్ళలు ఐనవి 
బుల్లి వర్ష బిందువులు. 
గంతులేస్తు, చిందులేస్తు 
పిల్లలు ఫక్కున నవ్విరి. 

టపా(ట) కాయలు

By kadambari piduri, Apr 17 2009 5:16PM
వేటూరి సుందర రామ్మూర్తి సినీ రంగంలో "పాటల రచయిత"గా కాలూని, లబ్ధ ప్రతిష్ఠులు అయ్యారు. 
గీత రచయితగా అనేక అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వేటూరికి 
రా సాగాయి. 
"మనసు కవి"గా సుప్రసిద్ధులు ఐన ఆత్రేయ గారికి అవకాశాలు సన్నగిల్లాయి. 
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

దీపావళి పండుగ వస్తూన్నది. అంతటా హడావుడి సందడిగా ఉన్నది. 
మార్కెట్టులో ఆ ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యారు. 
పరస్పరమూ పలకరించుకున్నారు.ఆత్రేయ కావలసిన బాణసంచా కొనేసి, నిండు సంచీతో ఇంటిముఖం పట్టారు. 
"టపా కాయలు కొనేసారా?" స్నేహ పూర్వకముగా 
అడిగారు వేటూరి సుందర రామ్మూర్తి. 

"నా 'పాట కాయ'లన్నీ మీకే వస్తున్నాయి గదా! 
అందుకే ఊరికే ఖాళీగా ఉండట మెందుకు లెమ్మని, 
ఇదిగోండి!ఇలాగ 'టపా కాయలు' తెస్తున్నాను." 
అన్నారు ఆత్రేయ స్నేహ పూర్వకంగానే , 
సంభాషణలలోనూ పదముల అలికిడిని కలిగిస్తూ . 
Views (6) | Post Your Commen

వందనమిదే!

By kadambari piduri, Apr 16 2009 11:17AM
వాడేటి పూవులకు ఆసరాగా 
నిలిచిన తొలకరుల మబ్బులకు 
అభివాదము! అభివాదము! // 

పాడేటి పికములకు 
చివురులను ఒసగిన 
మామిడి తరువులకు,//అభి// 

పాడి పంటల అలరారేటి 
పల్లెల తొణికేటి మమత లన్నిటికిని //అభి// 

మా పల్లె జనములకు 
చదువులను ప్రేమతో 
నేర్పేటి గురువులకు 
అభివాదము! అభివాదము //

కొత్త అంజనం

By kadambari piduri, Apr 16 2009 10:59AM

పల్లవి: వేణు వినోదం మృదు భావ విహారం 
వీనుల కొసగిన మధురాంజనము 

అనుపల్లవి: యమునా తీరం, క్రీడా వినోదం 
లలిత లలితముగ కళలను కలిసిన 
ఈ ధ్యాన మెంతటి మనోహరము 

1) ఈలల గీతం 
ఈ లలనల హాసము 
సుమధుర శబ్దములాయినవి 
సంగీతమునకు చిరు నామాలు 
కోరస్: 
ఇల్లూ వాకిలి,పల్లె పట్ణములు 
రేవులు,వనములు,కో





ఈ ధ్యాన మెంతటి మనోహరము 

1) ఈలల గీతం 
ఈ లలనల హాసము 
సుమధుర శబ్దములాయినవి 
సంగీతమునకు చిరు నామాలు 
కోరస్: 
ఇల్లూ వాకిలి,పల్లె పట్ణములు 
రేవులు,వనములు,కోవెలలు 
కళల వలయముల హరివిల్లులయేను 

2)గళముల సౌరుగ జానపదాలు, 
ప్రతి అడుగు జాడలును 
చిందిన సొగసుల పల్లె పదాలను 

3)ఇందిందివియే ఇవియే 
అరువది నాలుగు కళలకు నెలవులు 

Baala

పెళ్ళిపెద్ద

By kadambari piduri, Apr 14 2009 10:16AM
ఏనుగు !ఏనుగు!ఎటు పోతున్నవ్? 
(answer)::: 
ఘీంకరిస్తూ అడవికి పోతా! 
(ప్రశ్న) ::: 
అడవికి పోయి అటేమి చేస్తావ్? 
( answer )::: 
పద్మావతినీ భయ పెడతాను 
శ్రీనివాసులుతొ దోస్తీ కట్టి 
సాష్టాంగం!దండ ప్రణామం! 

అమ్మకు,అయ్యకు కళ్యాణం 
అంగ రంగ వైభోగంగా జరిపించేస్తా! 
నా వీపు పైన అంబారి కట్టి 
వధూ వరులను కూర్చుండ బెట్టి 
ఊరేగిస్తా ముల్లోకములు. 

పూవు

By kadambari piduri, Apr 10 2009 8:19AM
పూవూ!పూవూ!అవ్వాయ్ తువ్వాయ్! 
సుతి మెత్తని సుతారమీవు // 

మెత్తని నవ్వువు నువ్వు 
తావిని ఎడదను హత్తు కొందువు// 

రంగుల నద్ది, రేకు రేకును 
తురగము చేసి 
వెన్నెల తేరుకు, బహుమానం 
ఇచ్చిన దాతవు నువ్వు // 

బాలల జగతికి నీవే 
ఊహల సారధి వైనావే! 
కవి భావాలను నువ్వే 
దౌడును తీయిస్తావు //

Recipes

మా అమ్మమ్మ, తాతయ్య వంటి వాళ్ళు ఆ రోజులలో పల్లెటూరులలో ఆయుర్వేద వైద్యము,చిట్కా వైద్యాలను చేసే వారు. పైసా పుచ్చుకోకుండా పల్లె జనులకు పంచాంగము, ముహూర్తములు చెప్పుట, ఉచిత సలహాలు ఇచ్చేవారు. వారి సేవలను ఈ రోజులతో పోల్చి చూస్తే ,లక్షాధికారులై ఉండే వారేమో ననిపిస్తుంది. వారు ఇప్పుడు లేరు, కానీ వారు ఆ యా సందర్భాలలో అనుసరించిన చిట్కాలను గుర్తు ఉన్నంత వరకూ చెప్పే ప్రయత్నము ఇది. 

జలుబు తగ్గేందుకు చిట్కా: 

అల్లము రసము - చెంచాడు 
తమలపాకుల రసము - రెండు చెంచాలు 
తేనె - రెండు చెంచాలు 

ఈ మూడిట్నీ కలపాలి. ఈ రసముల మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి త్రాగాలి. త్రాగిన వెంటనే ఒక చెంచాడునీళ్ళు తాగాలి. ఇలా చేస్తే పడిశము నుండి కొంత ఉపశమనము లభిస్తుంది. 

డాక్టరు దగ్గరికి వెంటనే వెళ్ళేందుకు వీలు కుదరనప్పుడు, ఇలాటి చిట్కాలు ఆపద్ధర్మముగా ఉపకరిస్తాయి. 

జ్వరంలో పాణిగ్రహణం!

By kadambari piduri, Apr 5 2009 5:21PM

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య 1889 జూన్ లోకృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులో జన్మించారు. అప్పటి దాకా కందుకూరి వీరేశ లింగము మున్నగు వారి సంఘ సంస్కరణలలో వన్నె కెక్కిన ఆంధ్ర దేశము, స్వాతంత్ర్య పోరాటములో కూడా దీటు లేనిదనే ఖ్యాతిని గాంచినది. 

సరే! వారి జీవితములో ఒక హాస్య సంఘటన తాలూకు "రిమ రిమల"ను జ్ఞప్తికి తెచ్చుకుందాము. 

ఒక సారి గోపాల క్రిష్ణయ్య గారికి జ్వరం వచ్చింది. కుశల మడగుదామని దువ్వూరి సుబ్బమ్మ గారు వచ్చారు. ఆమె కూడా స్వాతంత్ర్య సాధనకై పోరాట రంగములోనికి ప్రవేశించిన అలనాటి నారీ శిరో మణి. జ్వర తీవ్రతతో "హా హా హూ హూ " అంటూ తెగ వణికి పోతున్నారు ఆ రామదండు నేత. 

"ఏమిటీ? జ్వరం ఎక్కువగా ఉన్నదా? ఏదీ చూస్తాను!" అంటూ చేయి పట్టుకుని నాడిని చూడసాగారు సుబ్బమ్మగారు. అంత జ్వరంలోనూ "అసలే జ్వరంతో బాధ పడుతూంటే మధ్యలో పాణి గ్రహణము కూడానా!" అని ఛలోక్తిని విసిరారు దుగ్గిరాల. 

తపము లేనిదె యెన్నరే నెపము లెల్ల!

By kadambari piduri, Apr 5 2009 4:53PM

"ఆంధ్ర రత్న" బిరుదు కల దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు. కోదండ రామయ్య, సీతమ్మ దంపతులకు పుణ్య ఫలముగా పుట్టిన గోపాల క్రిష్ణయ్య "రామ దండు" సమర దళమును నిర్మించి,స్వాతంత్ర్యసయుద్ధములో తన క్రియా శీలతను నిరూపించుకొనిన ధీశాలి. అంతేకాదు! ఆయన గాయకుడు, రచయిత కూ డా! ఆ దుగ్గిరాల వారి రచనలలో ఒక వ్యంగ్య సీస పద్యమును చూడండి. 

కొండెంకటప్పన్న గుండు సున్న గదన్న 
     గోపాల కిట్టాయి కొక్కిరాయి 
టంగుటూరు ప్రకాశ మింగిలీసు పిశాచి 
     నాగేశ్వరుడు వట్టి నాగ జెముడు 
పట్టాభి సీతన్న తుట్టె పురుగు గదన్న 
     ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు 
గొల్ల పూడ్వరన్న కళ్ళు లేని కబోది 
     బులుసు సాంబడు వట్టి పుట్టు కుంక 
అయ్యదేవర గాడు పెయ్య నాకుడు గాడు 
     అయ్యంకి రమణయ్య దయ్యమయ్య 
డాక్టర్ సుబ్రహ్మణ్య మాక్టింగ్ పులిష్టాపు 
     దువ్వూరి సుబ్బమ్మ దృష్టి బొమ్మ 



తే.అనుచు పల్కుదు రాంధ్రుల నవని యందు 
గాంధి శ్రేష్ఠుని మతములో గలిసి నపుడు 
తపము లేనిదె యెన్నరే నెపము లెల్ల 
రామ నగరీ నరేంద్ర! శ్రీ రామచంద్ర! 


ఈ శతక పద్యము తొలి భాగము చదవగానే "ఇది తిట్టు కవిత్వము కామోసు!" అని అనిపిస్తుంది. "గాంధి మహాత్ముని"మతములో చేరినపుడు అందరూ అలాగ అనుకొన్నారనగానే,ఆ రచనలోని చమత్కారము చదువరికి నవ్వు తెప్పిస్తుంది. 

నేటి ఎన్నికల ప్రచారము హోరు గమనించండి. దూషణ భూషణ తిరస్కారములతో, తిట్టు
 పురా


నేటి ఎన్నికల ప్రచారము హోరు గమనించండి. దూషణ భూషణ తిరస్కారములతో, తిట్టు పురాణములతో దద్దరిల్లి పోతూన్నది వాతావరణము. ఈ సందర్భములో పైన పేర్కొన్నట్టి పద్యము గుర్తుకు తెచ్చుకున్నాను!